Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్డ్ వేవ్ దిశగా వెళుతున్న ప్రపంచం - వీకే పాల్ హెచ్చరిక

Webdunia
శనివారం, 17 జులై 2021 (08:01 IST)
ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ దిశగా పయనిస్తుందని, ఇది కాదనలేని వాస్తవం అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా వాస్తవిక పరిస్థితులపై వీకే పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే మూడు, నాలుగు నెలలు ఎంతో కీలకమన్నారు. ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ దిశగా వెళుతోందని, ఇది కాదనలేని వాస్తవమన్నారు. 
 
ఇప్పటికే అమెరికా మినహా మిగతా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వీకే పాల్ వివరించారు. భారత్‌లో ఇప్పటివరకు హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదని, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని గుర్తుచేశారు.
 
దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ రాకుండా చూడాలన్న లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో 95 శాతం మరణాలు తగ్గాయని వీకే పాల్ అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కరోనా టీకాలను విధిగా వేయించుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments