Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవి దగ్గర గుసగుసలాడవద్దు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:59 IST)
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే రాజ్యసభలో సభ్యులకు చైర్మన్ వెంకయ్యనాయుడు కీలక సూచనలు చేశారు. కరోనా రాకుండా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు ఖచ్చితంగా అనుసరించాలని వెంకయ్యనాయుడు సభ్యులను కోరారు.
 
ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలని తెలిపారు. ఎవరు కూడా తమ స్థానాలను వదిలి వెళ్లొద్దని తెలిపారు. దీంతో పాటు చెవిలో వంగి గుసగుసలాడవద్దని కూడా విజ్ఞప్తి చేసారు. ఇలా చేయడం మానుకోవాలని ఇతర సభ్యులతో ఏదైనా చెప్పాలనుకుంటే దానిని స్లిప్ మీద రాసి ఇవ్వాలని తెలిపారు.
 
అలాగే సభ్యులెవరూ తమ కార్యాలయానికి రావద్దని తెలిపారు. కలవాలని తమకు ఉన్నా ప్రస్తుత పరిస్థితి రీత్యా భద్రతా ప్రమాణాలు అనుసరించాలని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు ఎన్నడూ లేని రీతిలో జరుగుతున్నాయి. కరోనా నియమాలు పాటించి సీటింగ్ అరేంజ్ చేశారు. అలాగే మాస్కులు తప్పనిసరి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments