దేశంలో మళ్లీ కరోనా.. మాస్క్ తప్పనిసరి అవుతుందా?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (22:22 IST)
భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం తప్పనిసరి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం, చైనా, యునైటెడ్ స్టేట్స్ సహా దేశాలలో కరోనా వైరస్ వేగంగా పెరగడం ప్రారంభించింది. దీంతో భారత్‌లో దీని ప్రభావం పెరగకముందే ముందుజాగ్రత్త చర్యలను ముమ్మరం చేస్తున్నారు. 
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్రాల్లో కరోనాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 
 
సమావేశం తర్వాత నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలందరూ మళ్లీ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయాలి. బూస్టర్ వ్యాక్సినేషన్ తీసుకోని వారు తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. భారతదేశంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫేస్ మాస్క్‌లను మళ్లీ తప్పనిసరి చేయవచ్చని అంటున్నారు
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments