Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాటుకు ఇద్దరు ఉపాధ్యాయులు బలి, బాపట్లలో కరోనా భయంతో వ్యక్తి సూసైడ్

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (18:44 IST)
గుంటూరు: జిల్లాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. తాడికొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు (పీజీటీ) కె.వెంకటనరసమ్మ, బడేపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ కిశోర్‌కుమార్‌ గురువారం మృతి చెందారు.

వెంకటనరసమ్మ గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి, కిశోర్‌కుమార్‌ చినకాకానిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తొలుత కిశోర్‌కుమార్‌ ఇద్దరు పిల్లలకు కరోనా సోకడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారికి వైద్యులతో చికిత్స అందించడంతో తగ్గింది. తర్వాత ఆయనకు పాజిటివ్‌ రావడంతో వారం రోజుల కిందట ఆస్పత్రిలో చేరారు. వెంకటనరసమ్మ కూడా పది రోజుల కిందట ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఉపాధ్యాయులు ఇద్దరినీ కరోనా కాటు వేయడంతో వారి కుటుంబీకులను, సహచర ఉపాధ్యాయులను కలచివేసింది.
 
బాధితుని బలవన్మరణం..
బాపట్ల: ఇంటి ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితుడు మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్లలో గురువారం చోటుచేసుకొంది. పట్టణంలోని రామకృష్ణాపురానికి చెందిన దర్జీ షేక్‌ మస్తాన్‌(44) ఇటీవల కరోనా బారినపడ్డాడు.

ఐదు రోజుల క్రితం కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అప్పటినుంచి మనస్తాపంతో ఇంట్లోనే ప్రత్యేకంగా గదిలో ఉంటూ ఔషధాలు తీసుకొంటున్నాడు. గురువారం మధ్యాహ్నం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments