Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ సంరక్షణా కేంద్రంగా మారిన క్రికెట్ స్టేడియం?

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (19:45 IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ దావఖానాలన్నీ నిండిపోతున్నాయి. దీంతో స్టార్ హోటళ్లు, కళ్యాణ మండపాలు, క్రికెట్ స్టేడియాలు, ఇండోర్ స్టేడియాలను తాత్కాలిక కోవిడ్ సంరక్షణా కేంద్రాలుగా మార్చుతున్నారు. ఇందులోభాగంగా, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని ఓ క్రికెట్‌ మైదానం ఇపుడు కోవిడ్ సంరక్షణా కేంద్రంగా మారిపోయింది.
 
ఇందులో 750 పడకలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ గురువారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చికిత్స పొందే కరోనా రోగులకు అత్యవసర సామగ్రితోపాటు మూడుపూటల భోజనం ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు. 
 
నిష్ణాతులైన వారితో నిత్యం యోగా, మెడిటేషన్‌ తరగతులను ఆన్‌లైన్‌ ద్వారా బోధిస్తారని ఇందుకోసం ఓ భారీ ఎల్‌ఈడీ తెరను సైతం ఏర్పాటు చేశామన్నారు. శానిటేషన్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలు, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 
 
ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 2,642 కరోనా కేసులు నమోదుకాగా ఇందులో 845 యాక్టివ్‌ కేసులున్నాయని, 1,745 మంది కోలుకున్నారని, 35 మంది మృతి చెందారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments