Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరో జిల్లాకు వ్యాపించిన కరోనా... 728కు పెరిగిన కేసులు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పైగా తాజాగా మరో జిల్లాకు ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమై హైఅలెర్ట్ ప్రకటించారు. జిల్లా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. 
 
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళకు అనారోగ్యం చేయడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె హైదరాబాద్‌లోనే చనిపోయింది. అప్పటికే పంపిన శాంపిల్స్‌లో ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. చనిపోయిన మహిళతో ఊరిలో వారికి ఉన్న అనుబంధం, కలిసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 728 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 368 కేసులు ఉన్నాయి. అలాగే, ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. దీంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మత సమ్మేళనానికి వెళ్లివచ్చిన వారందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments