తెలంగాణాలో మరో జిల్లాకు వ్యాపించిన కరోనా... 728కు పెరిగిన కేసులు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పైగా తాజాగా మరో జిల్లాకు ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమై హైఅలెర్ట్ ప్రకటించారు. జిల్లా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. 
 
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళకు అనారోగ్యం చేయడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె హైదరాబాద్‌లోనే చనిపోయింది. అప్పటికే పంపిన శాంపిల్స్‌లో ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. చనిపోయిన మహిళతో ఊరిలో వారికి ఉన్న అనుబంధం, కలిసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 728 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 368 కేసులు ఉన్నాయి. అలాగే, ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. దీంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మత సమ్మేళనానికి వెళ్లివచ్చిన వారందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments