Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరో జిల్లాకు వ్యాపించిన కరోనా... 728కు పెరిగిన కేసులు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పైగా తాజాగా మరో జిల్లాకు ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమై హైఅలెర్ట్ ప్రకటించారు. జిల్లా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. 
 
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళకు అనారోగ్యం చేయడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె హైదరాబాద్‌లోనే చనిపోయింది. అప్పటికే పంపిన శాంపిల్స్‌లో ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. చనిపోయిన మహిళతో ఊరిలో వారికి ఉన్న అనుబంధం, కలిసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 728 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 368 కేసులు ఉన్నాయి. అలాగే, ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. దీంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మత సమ్మేళనానికి వెళ్లివచ్చిన వారందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments