రోజుకు లక్ష కరోనే కేసులు నమోదు కావొచ్చు : దర్శకుడు తేజ

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (12:43 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఇప్పటికే మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల నమోదుపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిపై దర్శకుడు తేజ స్పందించారు. 
 
ప్రతిరోజు దేశంలో వేల సంఖ్యలో పెరిగిపోతోన్న కరోనా కేసులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు. 'ఇప్పుడు ప్రతి రోజు 11 లేదా 12 వేల కేసులు నమోదవుతున్నాయి. రోజుకి లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇండియా నంబర్‌ 1 వరస్ట్ పొజిషన్‌లోకి వెళ్లి పోతుంది' అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
 
'భారతీయుల తీరు ఇలాగే ఉంది. మన చుట్టూ ఉన్న వారికి కరోనా లేదని అనుకుంటున్నాము. మన స్నేహితులని, కూరగాయలు అమ్మే వారికి కరోనా లేదు కదా నాకు కూడా రాదు అని అనుకుంటున్నారు. నాకు కరోనా రాదు అనే భావనలో ఉన్నారు. 
 
కానీ, అందరిలోనూ కరోనా ఉందనే భావనతో వ్యవహరించండి. అలాంటప్పుడే కరోనాకు దూరంగా ఉండొచ్చు. కూరగాయలు కొన్న తర్వాత శానిటైజ్‌ చేయండి. సూపర్‌ మార్కెట్లో బిల్‌ కట్టి తిరిగి కార్డు తీసుకున్న తర్వాత శానిటైజ్ చేయండి' అని తేజ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments