Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు లక్ష కరోనే కేసులు నమోదు కావొచ్చు : దర్శకుడు తేజ

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (12:43 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఇప్పటికే మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల నమోదుపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిపై దర్శకుడు తేజ స్పందించారు. 
 
ప్రతిరోజు దేశంలో వేల సంఖ్యలో పెరిగిపోతోన్న కరోనా కేసులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు. 'ఇప్పుడు ప్రతి రోజు 11 లేదా 12 వేల కేసులు నమోదవుతున్నాయి. రోజుకి లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇండియా నంబర్‌ 1 వరస్ట్ పొజిషన్‌లోకి వెళ్లి పోతుంది' అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
 
'భారతీయుల తీరు ఇలాగే ఉంది. మన చుట్టూ ఉన్న వారికి కరోనా లేదని అనుకుంటున్నాము. మన స్నేహితులని, కూరగాయలు అమ్మే వారికి కరోనా లేదు కదా నాకు కూడా రాదు అని అనుకుంటున్నారు. నాకు కరోనా రాదు అనే భావనలో ఉన్నారు. 
 
కానీ, అందరిలోనూ కరోనా ఉందనే భావనతో వ్యవహరించండి. అలాంటప్పుడే కరోనాకు దూరంగా ఉండొచ్చు. కూరగాయలు కొన్న తర్వాత శానిటైజ్‌ చేయండి. సూపర్‌ మార్కెట్లో బిల్‌ కట్టి తిరిగి కార్డు తీసుకున్న తర్వాత శానిటైజ్ చేయండి' అని తేజ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments