దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, క్రియాశీలక కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ వైరస్ బారనపడి 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
 
కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరగా, 4.45 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేరళలో 15 వేలు, మహారాష్ట్రలో 3 వేల మందికి కరోనా సోకిందని బుధవారం కేంద్రం వెల్లడించింది. అయితే, దేశ వ్యాప్తంగా క్రియాశీల పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతుండటం సానుకూలాంశం. 
 
ప్రస్తుతం దేశంలో 3,01,989 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 0.90 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 34 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.27 కోట్లకు చేరాయి. కాగా, ఆగస్టు ఆఖరులో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన ఆర్‌ వ్యాల్యూ.. సెప్టెంబర్ మధ్యనాటికి క్షీణించింది. 0.92కి తగ్గడం ఊరటనిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments