Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, క్రియాశీలక కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ వైరస్ బారనపడి 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
 
కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరగా, 4.45 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేరళలో 15 వేలు, మహారాష్ట్రలో 3 వేల మందికి కరోనా సోకిందని బుధవారం కేంద్రం వెల్లడించింది. అయితే, దేశ వ్యాప్తంగా క్రియాశీల పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతుండటం సానుకూలాంశం. 
 
ప్రస్తుతం దేశంలో 3,01,989 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 0.90 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 34 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.27 కోట్లకు చేరాయి. కాగా, ఆగస్టు ఆఖరులో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన ఆర్‌ వ్యాల్యూ.. సెప్టెంబర్ మధ్యనాటికి క్షీణించింది. 0.92కి తగ్గడం ఊరటనిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments