Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, క్రియాశీలక కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ వైరస్ బారనపడి 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
 
కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరగా, 4.45 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేరళలో 15 వేలు, మహారాష్ట్రలో 3 వేల మందికి కరోనా సోకిందని బుధవారం కేంద్రం వెల్లడించింది. అయితే, దేశ వ్యాప్తంగా క్రియాశీల పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతుండటం సానుకూలాంశం. 
 
ప్రస్తుతం దేశంలో 3,01,989 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 0.90 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 34 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.27 కోట్లకు చేరాయి. కాగా, ఆగస్టు ఆఖరులో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన ఆర్‌ వ్యాల్యూ.. సెప్టెంబర్ మధ్యనాటికి క్షీణించింది. 0.92కి తగ్గడం ఊరటనిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments