Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 40 వేలకు తగ్గని కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 31 జులై 2021 (09:49 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా రోజు వారీ కేసుల నమోదులో 40 వేలకు తగ్గడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 41,649 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 
 
మరో 37,291 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 593 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,08,920 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,13,993కు పెరిగింది.
 
ఇందులో 3,07,81,263 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 4,23,810 మంది మృతి చెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 46,15,18,479 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. 
 
మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.29శాతం ఉన్నాయని, ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.42శాతం ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతం ఉందని చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో 46.64 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments