Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందిచ్చి యువతిపై అత్యాచారం

Webdunia
శనివారం, 31 జులై 2021 (09:39 IST)
నమ్మించి... మత్తుమందిచ్చి.. ఓ యువతి (19)పై ఇద్దరు బిడ్డల తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి అనారోగ్యంతో రెండేళ్లక్రితం చనిపోయింది. దీంతో కుటుంబ స్నేహితుడు, మంగళం బీటీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఆమె జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన నాగేంద్రబాబు తనపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆ యువతి అలిపిరి పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది.

28వ తేదీ తనకు మాయమాటలుచెప్పి శ్రీనివాసం సమీపంలోని ఓ లాడ్జికి నాగేంద్రబాబు తీసుకెళ్లాడని, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు సీఐ దేవేంద్రకుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేంద్రబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments