Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:50 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరోమారు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోల్చితే కేసుల సంఖ్య 3.4శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్‌ కేసులు దేశంలో నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, ఈ వైరస్ బారి నుంచి 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 530 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు.
 
ఇదిలావుంటే, యాక్టివ్‌ కేసుల సంఖ్య 150 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3,63,605 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. జాతీయ రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని పేర్కొంది. 
 
టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసింది. ఇప్పటి వరకు 50.26 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments