దేశంలో గణనీయంగా తగ్గిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (11:08 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 25 మంది చనిపోయారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,4ీ6,12,013కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 658 తగ్గి 28,593గా నమోదైంది. 
 
ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు కొత్తగా మహమ్మారి బారిన పడి 21 మంది మరణించారు. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
 
రోజువారీ పాజిటివిటీ రేటు 1.15 శాతంగా ఉంది. అదే వీక్లీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 218.97 కోట్ల కరోనా వ్యాక్సిస్‌ డోసుల్ని పంపిణీ చేశారు. 
 
గత 24 గంటల్లో నమోదైన మరణాల్లో ఒక్క కేరళలోనే 16 మంది ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కరు చొప్పున మరణించారు. ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments