దేశంలో భారీగా తగ్గిన కొత్త కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చింది. స్వల్ప హెచ్చుతగ్గులతో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదయ్యే కోవిడ్ కేసుల సంఖ్య పది వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
తాజాగా 1.84 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 5,221 మందికి కరోనా సోకినట్లు కేంద్రం సోమవారం వెల్లడించింది. పాజిటివిటీ రేటు 2.8 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 5,975 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 47,176(0.11 శాతం)కి తగ్గిపోయాయి. 
 
కాగా, గత 2020 ప్రారంభం నుంచి 4.45 కోట్ల మంది మహమ్మారి బారినపడగా 98.71 శాతం మంది వైరస్‌ను జయించారు. 5,28,165 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 215 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఆదివారం 30.76 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lokesh Kanagaraj: రజనీకాంత్-కమల్ హాసన్ చిత్రాల నుంచి తప్పుకోవడానికి కారణమదే: లోకేష్ కనగరాజ్

Mahesh Babu: ప్రియాంక చోప్రా నటనను ప్రశంసించిన మహేష్ బాబు

Manchu Manoj: రూత్ లెస్, బ్రూటల్ గా డేవిడ్ రెడ్డి లో మంచు మనోజ్

Sudheer: సుడిగాలి సుధీర్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా G.O.A.T (గోట్)

Padma Shri awardees: పద్మశ్రీ విజేతలు తెలుగు సినిమాకు లభించిన జాతీయ గౌరవం మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments