దేశంలో భారీగా తగ్గిన కొత్త కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చింది. స్వల్ప హెచ్చుతగ్గులతో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదయ్యే కోవిడ్ కేసుల సంఖ్య పది వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
తాజాగా 1.84 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 5,221 మందికి కరోనా సోకినట్లు కేంద్రం సోమవారం వెల్లడించింది. పాజిటివిటీ రేటు 2.8 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 5,975 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 47,176(0.11 శాతం)కి తగ్గిపోయాయి. 
 
కాగా, గత 2020 ప్రారంభం నుంచి 4.45 కోట్ల మంది మహమ్మారి బారినపడగా 98.71 శాతం మంది వైరస్‌ను జయించారు. 5,28,165 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 215 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఆదివారం 30.76 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన నాయగన్ సినిమా లీక్ అనుకోకుండా జరిగింది... వ్యవస్థ వైఫల్యం : కమల్ హాసన్

Rajinikanth : జైలర్ 2లో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడా ?

Gopichand:,గోపీచంద్ 33 టైటిల్ గ్లింప్స్, ఎపిక్ పోస్టర్ టీజర్ రాబోతోంది

Vijay: జననాయగన్ లీక్ నాకు కోపం తెప్పిస్తోంది : విజయ్ దేవరకొండ

Sharwa: నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను : శర్వా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments