దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (11:12 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. నిన్నటికి నిన్న 25 వేలుగా ఉన్న ఈ కేసుల సంఖ్య గత 24 గంటల్లో ఏకంగా 35 వేలు దాటిపోయాయి. కొత్తగా 37,593 మంది వైరస్ సోకినట్లు తేలింది. మరో 648 మంది మహమ్మారి కారణంగా మరణించారు. 
 
కొత్తగా ఒక్క రోజు వ్యవధిలో 34,169 మంది కరోనా​ను జయించారు. అయితే తాజా కేసుల్లో 64.6 శాతం కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయి. సోమవారం ఆ రాష్ట్రంలో 24,296 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 26 (28,798 కేసులు) తర్వాత కేరళలో 24వేల పైన కేసులు నమోదవడం మళ్లీ ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,12,366గా ఉంటే, మొత్తం మరణాలు 4,35,758గాను, మొత్తం కోలుకున్నవారు 3,17,54,281గాను, యాక్టివ్ కేసులు 3,22,327 చొప్పున ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, మంగళవారం ఒక్కరోజే 61,90,930 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 59,55,04,593 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: ఫోటోగ్రాఫర్ లోదుస్తులు ఇచ్చి వేసుకోమన్నాడు.. : ఐశ్వర్యా రాజేష్

Suriya: గజిని చాయలున్నా సరికొత్త కథగా సూర్య 46 చిత్రం : నాగవంశీ

విలక్షణ నటుడుగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సుదేవ్ నాయర్

కార్తీక దీపం సీరియల్‌ నటి.. దర్శకుడు విజయ్ కార్తీక్‌కు బ్రేకప్ చెప్పేసింది..

Bobby Kolli: మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన హీరో నవీన్‌ పొలిశెట్టి : దర్శకుడు బాబీ కొల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

తర్వాతి కథనం
Show comments