దేశంలో పెరిగిన పాజిటివ్ కేసులు - తగ్గిన మరణాలు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:08 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగాయి. అదేసమయంలో కరోనా మరణాలు మాత్రం తగ్గాయి. ఇటీవల 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.20 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,727 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
క్రితం రోజు నమోదైన కేసుల(23,529)తో పోలిస్తే దాదాపు 3 వేల కేసులు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటింది. కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. అక్కడ నిన్న 15,914 మంది వైరస్‌ బారిన పడగా.. 122 మరణాలు చోటుచేసుకున్నాయి. 
 
మరోవైపు, కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా 277 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు 4,48,339 మందిని వైరస్‌ బలితీసుకుంది. ఇక, మరోసారి కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. 
 
గడిచిన 24 గంటల్లో మరో 28,246 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.30కోట్లు దాటింది. రికవరీ రేటు 97.86శాతానికి చేరింది. అటు క్రియాశీల కేసులు కూడా మరింత తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 2,75,224 మంది కరోనాతో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.82శాతానికి పడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments