Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (13:24 IST)
దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 19,637 మందికి కోవిడ్-19 సోకిందని తెలిపింది.
 
దీంతో బాధితుల సంఖ్య 4,40,19,811కి చేరింది. గడిచిన 24 గంటల్లో 19,336 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా.. ప్రస్తుతం 1,43,676 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా 45 మరణాలతో, మరణాల సంఖ్య 5,26,357కు పెరిగింది. ఈ మేరకు నివేదికలో పేర్కొంది.
 
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది. జూలై 21వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారించారు. అతను ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా వేయించుకున్నారు. 
 
అయినప్పటికీ ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ నెల 27న జో బిడెన్‌కు పరీక్షలు నిర్వహించి ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఈ సందర్భంలో, బిడెన్‌కు ఈ రోజు (జూలై 31) మళ్లీ కోవిడ్ సోకినట్లు నిర్ధారించబడింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments