దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (13:24 IST)
దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 19,637 మందికి కోవిడ్-19 సోకిందని తెలిపింది.
 
దీంతో బాధితుల సంఖ్య 4,40,19,811కి చేరింది. గడిచిన 24 గంటల్లో 19,336 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా.. ప్రస్తుతం 1,43,676 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా 45 మరణాలతో, మరణాల సంఖ్య 5,26,357కు పెరిగింది. ఈ మేరకు నివేదికలో పేర్కొంది.
 
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది. జూలై 21వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారించారు. అతను ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా వేయించుకున్నారు. 
 
అయినప్పటికీ ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ నెల 27న జో బిడెన్‌కు పరీక్షలు నిర్వహించి ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఈ సందర్భంలో, బిడెన్‌కు ఈ రోజు (జూలై 31) మళ్లీ కోవిడ్ సోకినట్లు నిర్ధారించబడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై

Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్

తర్వాతి కథనం
Show comments