దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:14 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25,072 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదేవిధంగా గతేడాది మార్చి తర్వాత యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గాయని తెలపింది. ఈ కొత్త కేసులతో కలుపుకుని నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. 
 
అలాగే 24 గంటల్లో క‌రోనా నుంచి 44,157 మంది కోలుకున్నారు. నిన్న 389 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,34,756కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,16,80,626 మంది కోలుకున్నారు.    
 
3,33,924 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 7,95,543 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,25,49,595 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. 
 
మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 7,95,543 మందికి టీకా ఇచ్చామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం 58,25,49,595 డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments