కోవిడ్ కేసులు.. భారత్‌లో తగ్గుదల - ప్రపంచంలో పెరుగుదల

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:29 IST)
కరోనా వైరస్ వ్యాప్తి దేశ వ్యాప్తంగా క్రమేపీ తగ్గిపోతోంది. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొత్త కరోనా కేసుల నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,369 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, మరో 5,178 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,347గా ఉంది. మరోవైపు, ఇతర ప్రపంచ దేశాల్లో మాత్రం రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
 
ఇదిలావుంటే, మన దేశంలో ఈ వైరస్ నుంచి 5,28,185 మంది చనిపోయారు. ఇప్పటివరకు 4,39,30,417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో క్రియాశీలక రేటు 0.10 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments