Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు తీసేసి స్వేచ్ఛగా తిరిగే రోజులు వస్తాయ్.. ఫోటో వైరల్

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:23 IST)
newborn baby
కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు వాడటం తప్పనిసరిగా మారింది. కానీ త్వరలో ప్రజలు మాస్కులు తీసేసి స్వేచ్ఛగా తిరిగే రోజులు వస్తాయని తెలిపారు యూఏఈకి చెందిన డాక్టర్‌ సమీర్‌ చీబ్. అంటే కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వస్తుంది అనుకుంటే పొరబడినట్లే. డాక్టర్‌ సమీర్‌ చీబ్ ఉద్దేశ్యం వేరు. ఇటీవల డాక్టర్‌ సమీర్‌ చీబ్ తన ఆసుపత్రిలో ఓ మహిళకు డెలివరీ చేశాడు.
 
అప్పుడు పుట్టిన శిశువును డాక్టర్ చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో ఆ శిశువు డాక్టర్‌ సమీర్‌ చీబ్ ధరించిన మాస్క్‌ను తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో ప్రపంచం మాస్కును తొలగించే రోజు త్వరలో వస్తుందని, ఈ విషయం ఆ పాప సింబాలిక్‌గా చెప్పిందని డాక్టర్ అన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను డాక్టర్ ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
 
"త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనమందరం కోరుకుంటున్నాం కదా" అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాప పుణ్యమాని మాస్కులు తొలగించే రోజులు త్వరలో రావాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments