దేశంలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (09:25 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాకస్థాయికి చేరనుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఉగ్రరూపం దాల్చుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి గత నెల వరకు దేశంలో పెద్దగా ప్రభావం చూపని కరోనా వైరస్.. ఇపుడు అన్ని రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో వ్యాపిస్తుంది. 
 
ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష కేసులను దాటేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీ నాటికి కరోనా థర్డ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతుందని ఐఐటీ మద్రాస్ గణిత విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా అభిప్రాయపడ్డారు. తాను జరిపిన కంప్యూటర్ అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. 
 
అయితే, కరోనా థర్డ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తలే కారణని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా గతంలోమాదిరిగా ప్రజలు భౌతికదూరాన్ని విస్మరించడం, కరోనా ఆంక్షలు లేకపోవడంతో థర్డ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. 
 
అందువల్ల రెండో వేవ్‌‌తో పోల్చితో థర్డ్‌వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే ఆస్కారం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, మరణాల తీవ్రత మాత్రం రెండో వేవ్‌తో పోల్చితే కాస్త తక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

తర్వాతి కథనం
Show comments