Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (09:25 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాకస్థాయికి చేరనుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఉగ్రరూపం దాల్చుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి గత నెల వరకు దేశంలో పెద్దగా ప్రభావం చూపని కరోనా వైరస్.. ఇపుడు అన్ని రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో వ్యాపిస్తుంది. 
 
ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష కేసులను దాటేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీ నాటికి కరోనా థర్డ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతుందని ఐఐటీ మద్రాస్ గణిత విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా అభిప్రాయపడ్డారు. తాను జరిపిన కంప్యూటర్ అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. 
 
అయితే, కరోనా థర్డ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తలే కారణని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా గతంలోమాదిరిగా ప్రజలు భౌతికదూరాన్ని విస్మరించడం, కరోనా ఆంక్షలు లేకపోవడంతో థర్డ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. 
 
అందువల్ల రెండో వేవ్‌‌తో పోల్చితో థర్డ్‌వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే ఆస్కారం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, మరణాల తీవ్రత మాత్రం రెండో వేవ్‌తో పోల్చితే కాస్త తక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments