Webdunia - Bharat's app for daily news and videos

Install App

చచ్చిన కుక్కలను చెత్త వాహనంలో పడేసినట్లు కోవిడ్ రోగుల శవాలు చెత్త బండిలో...

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (20:15 IST)
ఎపుడైనా వీధి కుక్కలు చనిపోతే... వాటిని చెత్త వాహనాల్లో వేసుకుని వెళ్లి డంప్ యార్డులో పడేస్తుంటారు. అలాంటి ఘటన మనుషుల మృతదేహాలను తరలించే దారుణ ఘటన ఛత్తీష్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంతటిదో ఈ దారుణ ఘటన చూపిస్తోంది.
 
కరోనా కారణంగా చనిపోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను తరలించేందుకు చెత్తను తరలించే వాహనాలను ఉపయోగించి చెత్తను పారేసినట్లు మనుషుల మృతదేహారను ఆ బండిలో పడేశారు. ఆ తర్వాత ఆ నలుగురి మృతదేహాలను స్మశానానికి తరలించారు. హృదయాన్ని కలచివేసే ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాజ్‌ నందగావ్‌ జిల్లాలోని డోంగార్గావ్‌‌లో చోటుచేసుకుంది.
 
చనిపోయిన నలుగురు వ్యక్తులు ఆక్సిజన్ అందక మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా అలాంటిదేమీ లేదని వైద్యాధికారులు కొట్టిపారేశారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మృతి చెందినట్లు తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాలను స్మశానాలకు తరలించడం తమ బాధ్యత కాదనీ, అదంతా నగర పాలక సంస్థ చూసుకోవాల్సిందేనంటూ అధికారులు చెప్పారు. నగర పాలక సంస్థ వారు ఇలా చెత్త వాహనాల్లో మృతదేహాలను తరలించడం విమర్శలకు దారితీస్తోంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments