Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలా మజాకా.. కరోనాను ఎదుర్కొనే శక్తి పురుషుల కంటే...?

మహిళలా మజాకా.. కరోనాను ఎదుర్కొనే శక్తి పురుషుల కంటే...?
, గురువారం, 27 ఆగస్టు 2020 (18:37 IST)
మహిళలా మజాకా.. కరోనాను ఎదుర్కొనే శక్తి పురుషుల కంటే.. మహిళల్లోనే ఎక్కువగా వుంటుందని తాజా పరిశోధనలో తేలింది. ఇందుకు కారణంగా మహిళల్లో వుండే ''టి'' కణాలే. టి కణాన్ని టి లింఫోసైట్ అని కూడా అంటారు. ఇవి ఒకరకమైన తెల్లరక్తకణాలు. ఇవే రోగనిరోధక శక్తిని నిర్ణయిస్తాయి. 
 
మహిళల్లో ఉండే 'టి' కణాలు బలంగా ఉండటం వల్లే... పురుషులకంటే సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 'నేచర్' పత్రికలో ఈ వివరాలను ప్రచురించారు. అమెరికాలోని యేల్ న్యూ హెవెన్ ఆసుపత్రిలో పద్ధెనిమిదేళ్ళ వయస్సు పైబడిన 86 మంది కరోనా రోగులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
 
టి కణాలు బలంగా ఉన్న వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పురుషులతో పోల్చుకుంటే... ఈ టి సెల్స్ మహిళల్లోనే శక్తివంతంగా ఉంటాయని, తద్వారా కరోనాను ఎదుర్కొనే శక్తి మహిళల్లో అధికంగా వుంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 
 
కోవిడ్ 19 తీవ్రత మగవారిలోనే ఎక్కువగా ఉంటోందని ఇంతకుముందు కూడా పరిశోధనలు వెల్లడించినా అందుకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇప్పుడు మాత్రం స్పష్టత వచ్చింది. టీ కణాలు రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తాయని.. ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలను చంపటంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయని వెల్లడి అయ్యింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో పూణెలోపుట్టిన ఆసీస్ మహిళా క్రికెటర్ లీసా..