తెలుగు రాష్ట్రాల్లో కరోనా.. తెలంగాణలో కొత్తగా 2,278 కేసులు.. ఏపీలో 9999 కేసులు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (09:50 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... గడిచిన 24 గంట్లలో కరోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే కరోనా బారిన పడి మొత్తం 950 మంది మరణించారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 1,21,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీలో 331, రంగారెడ్డిలో 187, మేడ్చల్‌లో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్రంలో 9999 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,47,686కి పెరిగింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4779కి చేరింది.
 
గడిచిన 24 గంటల్లో ఏపీలోని కడప జిల్లాలో 9, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 8, గుంటూరు 7, కృష్ణా 7, అనంతపురం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 3, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments