Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు కరోనా వస్తే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (16:29 IST)
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనాకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో దేశ ప్రజలను అప్రమత్తం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పువ్వాడ ఆరోపించారు. భౌతిక దూరం మన దేశంలో సాధ్యంకాదని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వస్తే వెలివేసే విధానం సమాజంలో ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 
 
తనకు కరోనా వస్తే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటానని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. కరోనా కాలంలో బాధ్యత లేని కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. కాగా.. ఇప్పటికే తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. వారిలో మెజార్టీ నేతలు ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత వంటి వాళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పువ్వాడ తనకు కరోనా సోకితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాకుండా ప్రభుత్వానికి గాంధీ ఆస్పత్రిలోనే కరోనా చికిత్స తీసుకుంటానని చెప్పడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments