Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి కరోనా.. ఆ ఎనిమిది మంది పోలీసులకు మళ్లీ కోవిడ్...

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (20:38 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న క్రమంలో​ హైదరాబాద్‌లో సెకండ్ వేవ్‌ కలకలం రేపుతోంది. ఇక తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందా.. అనే సందేహాలు తలెత్తున్నాయి. అయితే వారి సందేహం నిజమేనని ఆందోళన వ్యక్తం అవుతోంది. 
 
ఇవాళ ఎస్‌ఆర్‌‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఏకంగా ఎనిమిది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో నలుగురు సెక్టార్ ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే, ఈ ఎనిమిది మందికి కోవిడ్ సోకడం ఇది రెండో సారి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
గత జూన్ నెలలో తొలిసారి కరోనా బారినపడ్డ ఈ పోలీసులు.. మరలా ఇప్పుడు మరోసారి ఆ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఎస్‌ఆర్‌‌నగర్‌ పోలీసులు భయాందోళనలు నెలకొన్నాయి. చలి కాలంలో కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యాధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు. 
 
మరోవైపు, రెండోసారి కోవిడ్ సోకిన కేసులు కూడా హైదరాబాద్‌‌లో వెలుగు చూశాయి. ఎస్‌ఆర్‌నగర్‌‌లో ఏకంగా ఎనిమిది మందికి రెండోసారి కోవిడ్ సోకడం కలకలం సృష్టిస్తోంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments