Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కోటి ఏకాదశి.. ఉప్పల్ కార్పొరేటర్ దంపతులకు కరోనా పాజిటివ్..

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:07 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా ఉప్పల్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ మందుముళ్ల రజితా పరమేశ్వర్‌రెడ్డి దంపతులు కరోనా బారినపడ్డారు. 
 
దంపతులిద్దరికీ కరోనా సోకినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని శుక్రవారం నిర్ధారణ అయినట్లు తెలిపారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అవుతున్నట్లు కార్పొరేటర్‌ దంపతులు ప్రకటించారు. వివిధ కార్యక్రమాల్లో తమతోపాటు పాల్గొన్న వారు కరోనా పరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. 
 
శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని కార్పొరేటర్‌ దంపతులు ఉప్పల్‌లోని కరిగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం, ఉప్పల్‌ రామాలయం, రామంతాపూర్‌లో సత్యనారాయణస్వామి ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments