Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగితో టిక్ టాక్ వీడియో, ఎవరు? ఎక్కడ?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:43 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనాను పట్టించుకోకుండా చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రం వేలూరులో జరిగింది.
 
లండన్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిని కరోనా లక్షణాలతో తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చేశారు. రికవరీ నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంది. అయితే గతంలో ఆ యువతి టిక్ టాక్‌లో ఫేమస్. 
 
దీంతో టిక్ టాక్ వీడియోలు బెడ్ పైన తరచూ చేస్తూనే ఉంది. దీన్ని గమనించిన పారిశుధ్య కార్మికులు మేము కూడా మీతో కలిసి ఒక టిక్ టాక్ వీడియో చేస్తామన్నారు. ఆ ముగ్గురు పారిశుధ్య కార్మికులకు టిక్ టాక్ పిచ్చి బాగానే ఉంది. దీంతో ఆ అలవాటు మానుకోలేక ఆ యువతితో కలిసి ఒక వీడియో చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. 
 
దీంతో వేలూరు జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ముగ్గురు పారిశుధ్య కార్మికులను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వారి రక్తనమూనాలను సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments