Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగితో టిక్ టాక్ వీడియో, ఎవరు? ఎక్కడ?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:43 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనాను పట్టించుకోకుండా చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రం వేలూరులో జరిగింది.
 
లండన్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిని కరోనా లక్షణాలతో తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చేశారు. రికవరీ నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంది. అయితే గతంలో ఆ యువతి టిక్ టాక్‌లో ఫేమస్. 
 
దీంతో టిక్ టాక్ వీడియోలు బెడ్ పైన తరచూ చేస్తూనే ఉంది. దీన్ని గమనించిన పారిశుధ్య కార్మికులు మేము కూడా మీతో కలిసి ఒక టిక్ టాక్ వీడియో చేస్తామన్నారు. ఆ ముగ్గురు పారిశుధ్య కార్మికులకు టిక్ టాక్ పిచ్చి బాగానే ఉంది. దీంతో ఆ అలవాటు మానుకోలేక ఆ యువతితో కలిసి ఒక వీడియో చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. 
 
దీంతో వేలూరు జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ముగ్గురు పారిశుధ్య కార్మికులను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వారి రక్తనమూనాలను సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments