Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు... మోడీ పర్యటన రద్దు

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (08:51 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తన బంగ్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 17వ తేదీన మోడీ ఢాకాకు వెళ్లాల్సివుంది. కానీ, తాజాగా ఆ దేశంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
 
ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు బంగ్లాదేశీయులకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శత జయంతి వేడుకలను వాయిదా వేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఉత్సవ కమిటీ ఛైర్మన్ అబ్దుల్ చౌదరి తెలిపారు. కాగా, ఈ నెల 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో నిర్వహించనున్న ఇండో-ఈయూ సదస్సుకు కూడా మోడీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే విధంగా పలు దేశాధినేతల పర్యటనలు కూడా కరోనా దెబ్బకు రద్దు అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments