Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు... మోడీ పర్యటన రద్దు

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (08:51 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తన బంగ్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 17వ తేదీన మోడీ ఢాకాకు వెళ్లాల్సివుంది. కానీ, తాజాగా ఆ దేశంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
 
ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు బంగ్లాదేశీయులకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శత జయంతి వేడుకలను వాయిదా వేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఉత్సవ కమిటీ ఛైర్మన్ అబ్దుల్ చౌదరి తెలిపారు. కాగా, ఈ నెల 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో నిర్వహించనున్న ఇండో-ఈయూ సదస్సుకు కూడా మోడీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే విధంగా పలు దేశాధినేతల పర్యటనలు కూడా కరోనా దెబ్బకు రద్దు అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments