Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి - మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు కరోనా

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (18:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకుతున్న వారిలో రాష్ట్ర ప్రజలతో పాటు.. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కరోనా బారినపడ్డారు. షరీఫ్‌కు కరోనా పాజిటివ్ రావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. షరీఫ్ సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.  
 
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కూడా కరోనా సోకింది. ఏపీలో ఇప్పటి వరకు 4,34,771 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,30,526 మంది కోలుకున్నారు. మొత్తం 3,969 మంది దీని బారిన పడి ప్రాణాలు వదిలారు.
 
కాగా, ఈ వైరస్ బారినపడి కోలుకున్న వారిలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వంటి రాజకీయనేతలు ఉన్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి, మండలి ఛైర్మన్ షరీఫ్‌లకు ఈ వైరస్ సోకింది. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments