Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత.. దేశంలో 35 కోట్లు దాటిన టీకాల పంపిణీ

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (10:58 IST)
వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత సాధించింది.. దేశంలో 35 కోట్లు దాటిన టీకాల పంపిణీ దాటింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్తా.. 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతోపాటు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 5 లక్షలకు దిగువన ఉన్నాయి. అయితే.. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందన్న సూచనలతో.. కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. 
 
కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ప్రధాన ఆయుధం కావడంతో.. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు వ్యాక్సిన్ ఉత్పత్తిపై కూడా దృష్టిసారించి వ్యాక్సినేషన్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ మరో మైలురాయిని సాధించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా35 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
 
శనివారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. ఒక్కరోజు దేశవ్యాప్తంగా 57.36లక్షలకుపైగా మోతాదులు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఒక్కరోజే దాదాపు ఆరు మిలియన్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments