Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతువుల నుంచి సోకుతున్న కరోనా వైరస్?

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (17:12 IST)
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ మూలాల గురించి ఇంకా పరిశోధన సాగుతూనే ఉంది. ఈ మూలాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో భాగంగా, కరోనా వైరస్ మూలాలు జంతువుల్లోనే ఉన్నాయని.. వాటి నుంచే మానవులకు సోకి ఉండవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వ్యాసాన్ని అంతర్జాతీయ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. 
 
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై విస్తృతంగా పరిశోధన జరుగుతుంది. తాజాగా అమెరికా పరిశోధకులు చేపట్టిన పరిశోధనలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులోభాగంగా, ఒమిక్రాన్‌కు సంబంధించి నిర్మాణాత్మక జీవశాస్త్ర విశ్లేషణను జరిపారు. అందులో ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్‌లో చోటుచేసుకున్న చాలా ఉత్పరివర్తనాలు ఎలుకల్లోని రెసిఫ్టర్‌ల నుంచి గ్రహించినట్టు గుర్తించారు. వీటి ద్వారానే ఒమిక్రాన్‌ వేరియంట్‌ మూలాలు మానవుల నుంచికాకుండా.. ఇతర జంతు జాతుల నుంచే వచ్చి ఉండవచ్చనే అంచనాకు వచ్చారు.
 
'జంతువుల నుంచి మానవులకు కరోనా వైరస్‌లు సంక్రమించడం అనేది ప్రపంచ ఆరోగ్యానికి ఎప్పుడూ ముప్పే. ఇప్పటివరకు మానవుల్లో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌లన్నీ జంతువుల నుంచే వచ్చాయని తాజా నివేదిక తెలియజేస్తోంది' అని అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటాకి చెందిన నిపుణుడు, తాజా పరిశోధన అధ్యయనకర్త ఫాంగ్‌ లీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments