Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా దూకుడు - 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (09:58 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దూకుడు మామూలుగా లేదు. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 33,750 మంది ఈ వైరస్ తాకిడికి గురయ్యారు. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,49,22,882కు చేరింది. వీటిలో 1,45,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, తాజాగా 123 మంది కరోనా బాధితులు మృతి చెందారనీ, ఈ మృతుల సంఖ్యతో కలుపుకుంటే మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 4,81,893కు చేరినట్టు వెల్లడించారు. అలాగే, ఆదివారం 10846 మంది కోలుకున్నారు. 
 
అదేసమయంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆదివారం దేశంలో మరో 123 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కు చేరింది. ఈ వైరస్ బారినపడినవారిలో 639 మంది కోలుకున్నారు. 
 
దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, కేరళ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, కర్నాటక, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments