హైదరాబాదులో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (12:19 IST)
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో మరో నాలుగు కొత్త కేసులు నమోదైనాయి. ఇతర దేశాల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)కు చేరుకున్న ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా నలుగురికి సార్స్-కోవీ-2 లోని ఓమిక్రాన్ వేరియెంట్‌ సోకింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
 
దీనితో తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్-19 పాజిటివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 24కు చేరుకుంది. మంగళవారం మొత్తం 726 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్‌జీఐఏకు చేరుకున్నారు, వీరిలో 4 మంది కోవిడ్-19కు పాజిటివ్‌గా పరీక్షించారు. నలుగురు కోవిడ్ పాజిటివ్ ప్రయాణికుల రక్త నమూనాలను పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ప్రస్తుతం, మొత్తం 13 నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వేచి ఉన్నాయి.
 
ఆర్‌జిఐఎ లో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 9122 మంది ప్రయాణికులు ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 59 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 24 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

Manchu Manoj : మోహన రాగ మ్యూజిక్ తో మంచు మ‌నోజ్‌

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments