Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి ఒరిస్సా గవర్నరు సతీమణి కన్నుమూత

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (12:33 IST)
కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది ప్రాణాలను హరిస్తోంది. ఇందులో అనేక మంది వీవీఐపీలు, సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఒరిస్సా రాష్ట్ర గవర్నరు గణేశీ లాల్ సతీమణి సుశీలా దేవి ఈ వైరస్ సోకి కోలుకున్న తర్వాత మళ్లీ తిరగబెట్టడంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
రాష్ట్ర ప్రథమ పౌరురాలైన సుశీలాదేవి అందరినీ చక్కగా పలకరించేవారని, ఎంతో మర్యాదగా మెలిగేవారని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. గవర్నర్ గణేశీ లాల్‌, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నవీన్ పట్నాయక్ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 
 
కరోనా వైరస్‌తో కొంతకాలంగా బాధపడుతూ వచ్చిన సుశీలా దేవి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. అయితే, ఈమెకు మళ్లీ ఈ వైరస్ పని చేయడం మొదలుపెట్టడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా ప్రస్తుతం గవర్నర్‌తోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
ఇంకోవైపు, దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 44,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. మొత్తమ్మీద దేశంలో 91,39,865 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. 
 
అలాగే కొత్తగా 511మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,33,738కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,486 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మొత్తమ్మీద 85,62,641 మంది కరోనా పేషెంట్లు రికవర్ అయ్యారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments