Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆ ఆరు రాష్ట్రాల్లో కరోనా.. అంతా నిర్లక్ష్యమే కారణం

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (13:14 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. 
 
మహారాష్ట్ర రాజధాని ముంబైలో జనం నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు మాస్కు ధరించని వారికి రూ.200 చొప్పున జరిమానా విధిస్తున్నా వారి తీరు మారడంలేదు.
 
మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నా ముంబైకర్లు పట్టించుకోవడంలేదు. గత మూడు రోజుల వ్యవధిలోనే 17,500 మంది మాస్కులు ధరించకూడా పట్టుబడ్డారంటే వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
ముంబైలోని శని, ఆది, సోమ వారాల్లో 17,500 మంది నుంచి రూ.35 లక్షల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఈ సాయంత్రం నాలుగు గంటలకు కొవిడ్ పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments