Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా-ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.50కి పెంపు.. దుప్పట్లు ఇచ్చేది లేదు..

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (17:03 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్.. భారత్‌లో అడుగెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంది. ఇంకా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేశాయి. తాజాగా కరోనా నియంత్రణకు రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఇందులో భాగంగా ముంబై, పూణె, భుసావల్, సోలాపూర్ డివిజన్లకు సంబంధించిన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రజలు ఎక్కువగా గుమికూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
అంతేగాకుండా.. ఏసీ బోగీల్లో కర్టెన్లు తొలగిస్తున్నామని, వీటిలో ప్రయాణికులకు దుప్పట్లు కూడా తాము అందించబోమని భారతీయ రైల్వే ప్రకటించింది. వీటిని ప్రతిరోజూ శుభ్రం చేయరని, అందుకే వీటిని తొలగిస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికులు ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments