Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా-ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.50కి పెంపు.. దుప్పట్లు ఇచ్చేది లేదు..

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (17:03 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్.. భారత్‌లో అడుగెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంది. ఇంకా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేశాయి. తాజాగా కరోనా నియంత్రణకు రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఇందులో భాగంగా ముంబై, పూణె, భుసావల్, సోలాపూర్ డివిజన్లకు సంబంధించిన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రజలు ఎక్కువగా గుమికూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
అంతేగాకుండా.. ఏసీ బోగీల్లో కర్టెన్లు తొలగిస్తున్నామని, వీటిలో ప్రయాణికులకు దుప్పట్లు కూడా తాము అందించబోమని భారతీయ రైల్వే ప్రకటించింది. వీటిని ప్రతిరోజూ శుభ్రం చేయరని, అందుకే వీటిని తొలగిస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికులు ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments