హడలెత్తిస్తున్న కరోనా వైరస్ : కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (14:48 IST)
దేశంలో కరోనా, ఒమిక్రాన్ వైరస్‌లు హడలెత్తిస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, పలు ఆంక్షలు విధిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీనికి నిదర్శనం మంగళవారం దేశ వ్యాప్తంగా 37 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడమే నిదర్శనం. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్క రోజులేనే 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా కఠిన చర్యలకు ఉపక్రమించింది. 
 
ప్రధానంగా కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రులు లేదా గృహాల్లో ఐసోలేషన్‌లో ఉండే సమయాన్ని 10 నుంచి ఏడు రోజులకు కుదించింది. వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే ఏడు రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొంది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ కేసు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.18 శాతంగా ఉంది. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments