Webdunia - Bharat's app for daily news and videos

Install App

హడలెత్తిస్తున్న కరోనా వైరస్ : కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (14:48 IST)
దేశంలో కరోనా, ఒమిక్రాన్ వైరస్‌లు హడలెత్తిస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, పలు ఆంక్షలు విధిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీనికి నిదర్శనం మంగళవారం దేశ వ్యాప్తంగా 37 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడమే నిదర్శనం. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్క రోజులేనే 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా కఠిన చర్యలకు ఉపక్రమించింది. 
 
ప్రధానంగా కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రులు లేదా గృహాల్లో ఐసోలేషన్‌లో ఉండే సమయాన్ని 10 నుంచి ఏడు రోజులకు కుదించింది. వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే ఏడు రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొంది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ కేసు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.18 శాతంగా ఉంది. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments