Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలను సాధిస్తున్న నెల్లూరు జిల్లా

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (15:49 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. దీనికితోడు అనేక మంది కరోనాతో ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా నిమిత్తం కోలుకున్న వారు ప్లాస్మా దానం అందించడంతో కొంతమంది తమ ప్రాణాలను రక్షించుకుంటున్నారు. దీంతో వివిధ జిల్లాలలో ప్లాస్మా థెరఫీని ప్రారంభిస్తున్నారు.
 
కరోనా నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయడం వల్ల అవి కరోనా రోగుల శరీరంలో రోగనిరోధక శక్తిని సంతరించుకుని వైరస్‌ను అంతం చేయడంలో దోహదకారిగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వల్ల అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు.
 
దీంతో నెల్లూరు జిల్లాలో ప్లాస్మా థెరఫీని ప్రారంభించిన వైద్యులు మంచి ఫలితాల్ని చవిచూసారు. కరోనా నుండి కోలుకున్న దాదాపు 130 మంది ప్లాస్మా దానం చెయ్యడంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న 75 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యడం వలన ప్రాణాంతక స్థితిలో ఉన్నవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, తద్వారా కరోనా రోగుల శరీరంలో వైరస్‌తో పోరాడి వాటిని అంతం చేస్తున్నాయని వైద్య నిపుణులు తెలియజేశారు.
 
ప్లాస్మా దానం వలన 55 శాతం అవి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను సంతరింప చేసి అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని వీటి వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో అధిక సంఖ్యలో కరోనా బాధితులకు ప్లాస్మా థెరఫీ అందించడం వల్ల మంచి ఫలితం లభించిందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం నెల్లూరు జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ ప్లాస్మా థెరఫీకి కావలసిన పరికరాలను సమకూర్చడానికి కావలసిన సహాయం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం
Show comments