Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ కోసం ఇటలీ వెళ్లిన కన్నడ జంట... మైసూరుకు రావొద్దంటూ కలెక్టర్ ఆర్డర్

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (11:07 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. ఇపుడు మరింత శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన గాయకుడు చందన్ శెట్టి ఇటీవల నివేదితా గౌడ్ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఈయన హనీమూన్ కోసం తన భార్యను తీసుకుని ఇటలీ వెళ్లాడు. 
 
అయితే, ఆయన ఇటలీ వెళ్లక ముందు కరోనా వైరస్ పెద్దగా వ్యాపించలేదు. కానీ, ఇటలీలో అడుగు పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితులను చూసి వణికిపోయారు. దీంతో ఆయన తన హనీమూన్ ఆనందాన్ని పక్కనబెట్టేశాడు. పైగా, తమ ప్రయాణాన్ని అర్థాంతరంగా ముగించుకుని స్వదేశానికి వచ్చాడు. ఈ విషయం మైసూరు వాసులకు తెలిసింది. అంతే.. వారు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మైసూరులో పలు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టరును కలిసిన పలువురు, ఇంతవరకూ మైసూరులో కరోనా లేదని, వారిద్దరినీ నగరంలోకి వెంటనే అనుమతించ వద్దని విజ్ఞప్తి చేశారు. వారికి ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, సామాన్యులను చూస్తున్నట్టుగానే 14 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి, ఆపై మాత్రమే వారిని అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ కూడా వారిద్దరూ మైసూరుకు రావొద్దంటూ ఆదేశాలు జారీచేశారు. దీంతో వారిద్దరూ ఇపుడు బెంగుళూరులోనే ఉండిపోయినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments