కోవిడ్ కొరఢా.. మాస్క్ ధరించలేదో రూ.1000 అపరాధం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (14:56 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తారా స్థాయికి చేరింది. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా, దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. అయితే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టే ప్రయాణికుల వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 
 
దీంతో విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేశారు. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. 
 
ఈ జరిమానా విధించడం ముంబై విమానాశ్రయంలో ప్రారంభించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) దీనికి సంబంధించి హెచ్చరిక జారీ చేసింది.
 
కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు తప్పనిసరి కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. విమానాశ్రయ ప్రాంగణంలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రయాణికులకు జరిమానా విధించాలని రెగ్యులేటర్ పేర్కొంది.
 
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డీజీసీఏ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రయాణికులకు రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఒక ప్రయాణికుడు మాస్క్‌ ధరించకున్నా, ఇతర కోవిడ్‌ నిబంధనలు పాటించకున్నా.. రూ.1000 జరిమానా విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
 
కాగా, శనివారం ముంబైలో 9,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 5,322 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో మరణించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 49,447 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 277 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments