Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 9న కరోనా బులిటెన్ : స్వల్పంగా పెరిగిన కేసులు

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (10:12 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోమారు స్వల్పంగా పెరిగాయి. అలాగే, వరుసగా రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...2,219 మంది మృతి చెందారు. మంగళవారం ఒక్కరోజే 1,62,664 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. 
 
దేశంలో వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,90,89,069కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 12,31,415 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటివరకు 2,75,04,126 మంది బాధితులు కోలుకున్నారు. 
 
కొవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 3,53,528 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.55 శాతం కాగా, మరణాల రేటు 1.22శాతంగా ఉంది. ఇప్పటివరకు 23,90,58,360 మందికి కరోనా టీకాలు వేయించుకున్నారు. 
 
కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 37,01,93,563 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,85,967 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments