Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన కరోనా కేసులు... ప్రపంచంలో రెండో దేశంగా భారత్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (11:04 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలతో పోల్చితే ఈ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. 
 
మంగళవారం ప్రకటన మేరకు దేశంలో మొత్తం 2,55,874 పాజిటివ్ కేసులు నమోదుకాగా బుధవారం వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు 2,85,914కు చేరుకుంది. అలాగే, 665 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశంలో ఈ వైరస్ నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. 
 
ఇదిలావుంటే, గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఫలితంగా గత మూడు వారాల వ్యవధిలో ఏకంగా 50 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమలో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు కోట్ల మార్కును దాటేసింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. 7.3 కోట్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments