వనదుర్గా భవనా ఆలయ ఈవోకు కరోనా ... వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (14:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో)కు కరోనా వైరస్ సోకింది. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో అనుమానం వచ్చిన ఆయన మెదక్‌ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ ఫలితం వచ్చింది. 
 
మందులు వేసుకుంటున్నా జ్వరం తగ్గక పోవడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చెస్ట్‌ స్కాన్‌ చేయించుకోవడంతో అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్‌కు వెళ్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారికి, ఆలయ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు.
 
ఇదిలావుంటే, ఈవో కరోనా బారిన పడటంతో భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడుపాయల ఆలయాన్ని శుక్రవారం నుంచి వారం రోజుల పాటు మూసి వేస్తున్నట్లు మెదక్‌ ఆర్డీవో సాయిరాం వెల్లడించారు. అమ్మవారికి చేసే పూజలు, అభిషేకాలు తదితరాలు యధావిధిగా కొనసాగుతాయని, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశానికి అనుమతి లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan New look: గ్యాంగ్ స్టర్ గా రామ్ చరణ్ కొత్త సినిమా చేయబోతున్నారా !

Mangli clarity: ఈ పార్టీలు, రాజకీయాలు నాకు వద్దంటూ మీడియా ముందు కన్నీరు పెట్టిన మంగ్లీ

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments