Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో డేంజర్ బెల్స్: 24 గంటల్లో 400 దాటిన కేసులు..!

Advertiesment
COVID19
కరోనా వైరస్ తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు 68,171 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం కోవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,674కి చేరింది. 
 
కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 23,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.
 
భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 715 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగ్న దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌!..ఎక్కడ