Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్ గాడిద పాలు రూ. 100, తాగితే కరోనా పరార్ అంటున్నారు, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (20:08 IST)
ఆవు పాలు, గేదె పాలు తాగడం సహజమే. పాలిచ్చే గాడిదలను తీసుకుని వచ్చి వాటి పాలు తీసి అమ్ముతున్నారు. ఈ పాలు తాగితే కరోనావైరస్, ఒమిక్రాన్ పారిపోతాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకేముంది.. అంతా గాడిద పాల కోసం ఎగబడుతున్నారు. కరోనా తగ్గుతుందని ప్రచారం చేస్తుండటంతో జనం బారులు తీరారు.

 
ఇదంతా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరుగుతోంది. గాడిద పాలకు కరోనాను అడ్డుకునే శక్తి వుందని ప్రచారం చేస్తుండటంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. దీనితో స్పూను గాడిద పాలు రూ. 100కి అమ్ముతున్నారు. లీటరు గాడిద పాలు కావాలంటే రూ.10,000 చెల్లించాలంటూ అడుగుతున్నారు. కొందరు అంత సొమ్ము ఇచ్చి గాడిద పాలు కొనుగోలు చేస్తున్నారు.

 
గాడిద పాలలో తల్లి పాలలో వుండే పోషకాలు వున్నప్పటికీ ఇది కరోనాను ఎదుర్కొంటుందంటూ ప్రచారం చేయడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా లక్షణాలున్నవారు వెంటనే ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ జనం మాత్రం గాడిద పాలను కొనడం ఆపడంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments