Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసుల్లో చైనాను అధికమించిన మూడు రాష్ట్రాలు!!

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:52 IST)
కరోనా వైరస్ కేసుల్లో మూడు రాష్ట్రాలు ఈ వైరస్‌కు పురుడు పోసుకున్న చైనాను అధికమించాయి. చైనాలో కేవలం 83 వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కానీ, మహాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో మాత్రం ఈ కేసుల సంఖ్య అధిమించాయి. 
 
మహారాష్ట్రలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 1,69,883 సంఖ్యతో ఆ రాష్ట్రం తొలిస్థానంలో కొనసాగుతున్నది. కరోనా వల్ల మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7,610 మంది మరణించారు. 
 
అలాగే, తమిళనాడు మరోసారి రెండో స్థానానికి చేరింది. ఆ రాష్ట్రంలో మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 86,224కు చేరగా 1,141 మంది చనిపోయారు. 
 
ఇక సోమవారం వరకు రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో గత 24 గంటల్లో 2,084 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,161కు పెరిగి  ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నది. ఢిల్లీలో వైరస్‌ బారినపడి 2,680 మంది మరణించారు. 
 
చైనాలో ఇప్పటివరకు మొత్తం 83,531 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యను మహారాష్ట్రతోపాటు తమిళనాడు ఇప్పటికే అదిగమించగా తాజాగా ఢిల్లీ కూడా దాటింది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో మూడొంతులు ఈ మూడు రాష్ట్రాల నుంచే నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments