Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా "మహా" విలయం.. ప్రతి 5 నిమిషాలకు ఒకరు మృతి... ఎక్కడ?

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (08:53 IST)
దేశంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ ప్రతి రోజూ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదతువున్నాయి. పైగా, ఈ వైరస్ ఇప్పట్లో ఉపశమించేలా కనిపించడంలేదు. ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఈ వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. 
 
గడచిన కొద్ది రోజులుగా వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో పాలకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రాష్ట్రంలో మరోమారు కొత్తగా 55 వేలకు మించిన కరోనా కేసులు వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 297 మంది మృతి చెందారు. 
 
అంతేకాకుండా, ఈ మృతుల లెక్కలను ఓసారి నిశితంగా పరిశీలిస్తే, ప్రతి ఐదు నిముషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 55,469 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఇదేసమయంలో మొత్తం 34,256 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో గడచిన 24 గంటల్లో 10,030 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహానగరంలో ఇప్పటి వరకూ 4,72,332 మంది కరోనా బారినపడ్డారు.*.txt

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments