Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయా ఆసుపత్రి ఫౌండర్ బి.నాగిరెడ్డి మనవడు కరోనావైరస్‌తో కన్నుమూత

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (19:38 IST)
తెలుగు, తమిళ చిత్ర నిర్మాత, విజయా వాహిని స్టూడియో వ్యవస్థాపకుడు బి. నాగి రెడ్డి మనవడు శరత్ రెడ్డి శుక్రవారం ఉదయం కరోనావైరస్ కారణంగా చెన్నైలో కన్నుమూశారు. శరత్ రెడ్డి వయసు 52 సంవత్సరాలు. బి. నాగి రెడ్డి కుమారుడు విశ్వనాథారెడ్డి ఇద్దరు కుమారులలో ఆయన చిన్నవాడు.
 
కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న అతడిని వెంటనే చెన్నైలోని విజయ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శరత్ రెడ్డి తుది శ్వాస విడిచారు. విజయా ఆసుపత్రి వారి సొంతదే అయినప్పటికీ కరోనావైరస్ ముందు చేతులెత్తేసింది. దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు, కరోనావైరస్ ఎంతటి భయంకరమైనదో.
 
చలన చిత్రరంగంలో టాప్ ప్రొడ్యూసర్ అయిన బి. నాగి రెడ్డి చెన్నై నగరంలో విజయ వాహిని స్టూడియోను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇది అప్పటి ఆసియాలో అతిపెద్ద చలన చిత్ర స్టూడియో. నాగి రెడ్డి నిర్మించిన చిత్రాలు అప్పట్లో సంచలన విజయం చవిచూశాయి.
 
ఎన్టీఆర్ పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ తదితర చిత్రాలు ఆయన నిర్మించినవే. నాలుగు దశాబ్దాలలో యాభై సినిమాల దాకా నాలుగు దక్షిణ భారత భాషలలో నిర్మించారాయన. 1970 తర్వాత విజయ-వాహిని స్టూడియో మూసివేసి దాని స్థానంలో విజయ హాస్పిటల్, విజయ హెల్త్ కేర్ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments