దేశంలో 73 రోజుల కనిష్టానికి కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (10:19 IST)
దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
కొత్తగా 62480 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవి 73 రోజుల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అలాగే, కొత్తగా 88,977 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 1,587 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారని తెలిపింది. 
 
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. మొత్తం 2,85,80,647 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్‌ కేసులున్నాయని వివరించింది. టీకా డైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 26,89,60,399 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వరుసగా 36వ రోజు రోజువారీ కొత్త కేసులను రికవరీలు మించిపోయాయని చెప్పింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 96.03 శాతానికి పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments