Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్... జాన్సన్ అండ్ జాన్సన్ ట్రయల్.. ఒక్క డోసే..

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:51 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కోవిడ్‌ నియంత్రణకు వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తమ వ్యాక్సిన్ పరీక్షల వేగం పెంచాయి. ఓ దశలో రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల చేసింది. 
 
మరో వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఇక ఈ బాటలోనే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కూడా ప్రయోగాలు చేస్తోంది. అయితే మిగితా వాటికి భిన్నంగా ఈ వ్యాక్సిన్ ఉండటం విశేషం. 
 
సాధారణంగా కరోనా వైరస్ అంతం చేయడానికి కనీసం రెండు డోసులు అయినా తీసుకోవాలని ఇప్పటి వరకు పలు కంపెనీలు ప్రకటించాయి. కానీ తమ సంస్థ తయారుచేసే మందు ఒకే ఒక్క డోసు ఇస్తే కరోనా అంతం అవుతుందని చెప్తోంది. 
 
దీనికి సంబంధించిన ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయని ప్రకటించింది. అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60 వేల మంది వాలంటీర్లకు ఈ టీకా ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. మంచి ఫలితాలు రాగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments